ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం
రెండు గదుల్లో 8 మంది డాక్టర్ల పరీక్షలు సరైన వైద్యం అందడం లేదంటున్న రోగులు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో దుస్థితి
మెట్పల్లి: మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవల విషయంలో వైద్యులు, రోగులు నానా అవస్థలు పడుతున్నారు. గదుల కొరతతో వై ద్యులంతా ఒక్కచోటనే కూర్చోని రోగులను పరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కోసం అక్కడే నూతన భవన నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ.. ఆ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. దీనివల్ల వైద్య సేవలు సక్రమంగా అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రెండు గదుల్లో ఎనిమిది మంది వైద్యుల సేవలు
ఈ చిత్రం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలోనిది. ఒకటే గది.. అది కూడా ఇరుకుగా ఉంది. అందులోనే ముగ్గురు వైద్యులు పక్కపక్కనే కూర్చోని రోగులను పరీక్షిస్తున్నారు. వీరితోపాటు కొంతమందికి రక్త పరీక్షలను కూడా ఈ గదిలోనే నిర్వ
హిస్తుండడం గమనార్హం.
ఆసుపత్రిలోని మరో గది ఇది.
ఇందులో కూడా ఐదుగురు వైద్యులు పక్కపక్కనే కూర్చోని ఇదిగో ఇలా.. రోగులను పరీక్షిస్తున్నారు. అంతమంది వైద్యులు ఉన్నా.. గదిలో రోగులు కూర్చునేందుకు మాత్రం కనీసం కుర్చో.. లేకుంటే స్టూల్ వేసే అవకాశమే లేదు. ఫలితంగా రోగులను నిలబెట్టే పరీక్షించి పంపుతున్నారు.
ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం
ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం


