ధర్మపురి: ప్రపంచ దేశాలు యోగాను పాటిస్తున్నాయని జూనియర్ సివిల్ జడ్జి యోగి జానకి అన్నారు. 11వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మపురిలోని జూనియర్ సివిల్ కోర్టులో శనివారం యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానసిక, శారీరక ప్రశాంతత, ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అలుక వినోద్కుమార్, ట్రెజరరీ జాజాల రమేశ్, ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు గడ్డం సత్యనారాయణరెడ్డి తదితరులున్నారు.
‘సార్’కు నివాళి
జగిత్యాలటౌన్: అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని శనివారం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ వలస పాలకుల చెరలో బందీ అయిన తెలంగాణ విముక్తి కోసం 1969 నుంచి జయశంకర్ పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. కార్యక్రమంలో పరిషత్ జిల్లా అధ్యక్షుడు చింతల రాజేశ్వర్, ఉపాధ్యక్షులు పడాల నరేష్, పొనగంటి రంజిత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి విశ్వబ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు సంకోజి వెంకటరమణ పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అడిషనల్ ఎస్పీ భీంరావు బదిలీ
జగిత్యాలక్రైం: అడిషనల్ ఎస్పీ భీంరావును కరీంనగర్ కమిషనరేట్కు బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు.
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలు భేష్
జగిత్యాల: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలు రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచాయని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. ఆయుష్మా న్ ఆరోగ్య కేంద్రాలైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాల్లో అందించే ఓపీ, వెల్నెస్ సేవలు బాగున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో స్థిరమైన సేవలు అందిస్తూ ముందున్నాయని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతినెలా ప్రోగ్రాం అధికారులు ఆరో గ్య మిషన్ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో రికార్డులను తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు సమియోద్దీన్, డాక్టర్ శ్రీనివాస్, అర్చన, జైపాల్రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.
జగన్నాథపూర్ బ్రిడ్జికి రూ.17.50 కోట్లు మంజూరు
రాయికల్: మండలం బోర్నపల్లి, జగన్నాథపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.17.50 కోట్లు మంజూరు కావడంతో శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను మాజీమంత్రి జీవన్రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ బోర్నపల్లి, జగన్నాథపూర్ వంతెన దశాబ్దాల కల అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సీఎం దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. నిధుల మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచ దేశాలన్నీ యోగాను పాటిస్తున్నాయి
ప్రపంచ దేశాలన్నీ యోగాను పాటిస్తున్నాయి
ప్రపంచ దేశాలన్నీ యోగాను పాటిస్తున్నాయి