
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
జగిత్యాల: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ శనివారం కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం నాయకులు అడువాల జ్యోతి, గిరి నాగభూషణం, పలువురు నాయకులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
టీఎన్జీవో నాయకులు..
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్ బాధ్యతలు స్వీకరించగా జగిత్యాలకు చెందిన టీఎన్జీవో నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నాగేందర్రెడ్డి, ఎండీ.వకీల్, మహమూద్, రవీందర్ పాల్గొన్నారు.