రాజీమార్గం ద్వారానే కేసుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గం ద్వారానే కేసుల పరిష్కారం

Jun 22 2025 3:48 AM | Updated on Jun 22 2025 3:48 AM

రాజీమార్గం ద్వారానే కేసుల పరిష్కారం

రాజీమార్గం ద్వారానే కేసుల పరిష్కారం

● జిల్లా జడ్జి రత్న పద్మావతి

జగిత్యాలక్రైం: రాజీమార్గం ద్వారానే కేసుల పరి ష్కారం సులువవుతుందని జిల్లా జడ్జి రత్న పద్మావతి అన్నారు. మెగా లోక్‌ అదాలత్‌ విజయవంతానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని శనివారం అభినందించి ప్రశంసపత్రాలు అందించారు. రాజీమార్గాల ద్వారా కేసుల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో 2500 కేసులు పరిష్కరించామన్నారు. పోలీసు అధికారులు, బార్‌ అసోసియేషన్‌, కోర్టు సిబ్బంది కష్టపడి కక్షిదారులను కలిసి విజయవంతం చేశారని తెలిపారు. రానున్న రో జుల్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్‌కుమార్‌, అదనపు జిల్లా జడ్జి నారాయణ, లీగల్‌సెల్‌ సెక్రటరీ వెంకట మల్లిక్‌ సుబ్రమణ్య శర్మ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, న్యాయమూర్తులు, బార్‌కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement