విద్యుత్‌ ప్రమాద బాధితులకు పరిహారం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ప్రమాద బాధితులకు పరిహారం

Jun 22 2025 3:48 AM | Updated on Jun 22 2025 3:48 AM

విద్యుత్‌ ప్రమాద బాధితులకు పరిహారం

విద్యుత్‌ ప్రమాద బాధితులకు పరిహారం

● మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు మంజూరు ● కోరుట్ల ఏడీఈ రఽఘుపతి

కోరుట్ల: విద్యుత్‌ షాక్‌ ప్రమాదాల్లో గాయపడిన వారికి పరిహారం అందిస్తామని కోరుట్ల ఏడీఈ రఘుపతి తెలిపారు. విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు మాత్రమే ట్రాన్స్‌కో పరి హారం ఇవ్వడం.. గాయపడిన వారికి దక్కని వైనంపై శనివారం ‘సాక్షి’లో ‘పరిహారం–పరిహా సం’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన ఏడీఈ మాట్లాడుతూ.. 2017 నుంచి గాయపడిన వారికి సివిల్‌ సర్జన్‌ ఇచ్చిన నివేదిక మేరకు పరిహారం అందించాలని సర్క్యులర్‌ ఉందని, ఇప్పటివరకు అలా పరిహారం అందలేదని, వైద్యాధికారుల సరైన నివేదికలతో తమకు దరఖాస్తులు అందితే పరిశీలించి ఉన్నతాధికారుల సూచనల ప్రకారం పరిహారం అందిస్తామన్నారు. గాయపడిన వారికి పరిహారం అందించే అంశంపై అవగాహన లేక ఎవరూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. గతంలో గాయపడిన వారు వైద్య నివేదికలు సమర్పిస్తే పరిశీలిస్తామన్నారు.

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

గణపతి విగ్రహం తరలింపులో కరెంటు షాక్‌తో మృతి చెందిన అలాల వినోద్‌, వెల్లుట్ల సాయికుమార్‌ కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మంజూరైనట్లు ఏడీఈ తెలిపారు. త్వరలో వారికి పరిహారం డబ్బులు అందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement