
వెల్లుల ఎల్లమ్మకు బోనాలు
మెట్పల్లిరూరల్/కోరుట్లరూరల్: మెట్పల్లి మండలం వెల్లుల, కోరుట్లలోని చిన్నమెట్పల్లి గ్రా మాల్లోని ఎల్లమ్మ తల్లి ఆలయాలకు భక్తులు పో టెత్తారు. మంగళవారం కావడంతో అమ్మవారికి బెల్లం, పుట్నాలు, కల్లు సమర్పించారు. కోళ్లు, పొ ట్టేళ్లను బలిచ్చారు. సల్లంగా చూడు ఎల్లమ్మ తల్లి అంటూ వేడుకున్నారు. వెల్లులలో భక్తుల ఏర్పాట్లను దేవాదాయశాఖ, పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఆలయానికి రూ.83,339తోపాటు 15 గ్రాముల వెండి సమకూరినట్లు అధికారులు తెలిపారు. చిన్నమెట్పల్లిలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.