
కుంట కట్ట నిర్మించి ఆదుకోండి
కొడిమ్యాల మండలంలోని కొండాపూర్ శివారులోని బూరుగుకుంట చెరువు మత్తడి, కట్టను కొందరు ధ్వంసం చేశారు. కట్ట కిందిభాగంలో ఉన్న మా పొలాలు మునిగే అవకాశం ఉంది. ఈ విషయమై గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా.. ఇరిగేషన్ అధికారులు కట్టకు మరమ్మతు చేసేందుకు ప్రయత్నించారు. కట్ట ధ్వంసం చేసిన వ్యక్తి పురుగుల మందు తాగుతానంటూ అడ్డుకున్నాడు. ఎస్సై, డీఎస్పీ, ఆర్డీవో, ఇరిగేషన్ ఈఈలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కట్టతోపాటు మత్తడికి మరమ్మతు చేసి పంట పొలాలతోపాటు మా ప్రాణాలను కాపాడండి. లేకుంటే పురుగుల మందు తాగి ప్రాణాలు వదలడం తప్ప మాకు వేరే మార్గం లేదు.
– కొడిమ్యాల రైతులు