● అధికారుల సమన్వయంతో ముందుకెళ్తూ జిల్లా అభివృద్ధి ● అన్ని రంగాల్లో ముందుంచిన కలెక్టర్ ● ఏడాది పాలన పూర్తి చేసుకున్న సత్యప్రసాద్
జగిత్యాల: ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేస్తూ.. వాటిని పారదర్శకంగా అమలు చే స్తూ జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచు తూ ముందుకెళ్తున్నారు కలెక్టర్ సత్యప్రసాద్. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాదిలోనే ఆయన జి ల్లాపై తన మార్క్ చూపించారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగంపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా ఆవిర్భవించిన తొలి మూడేళ్లు పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో హ్యాట్రిక్ సాధించిన విషయం తెల్సిందే. కరోనా అనంతరం మళ్లీ అట్టడుగు స్థానంలోకి పడిపోయింది. ఈ క్రమంలో కలెక్టర్ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ఉన్నత స్థానంలో నిలబెట్టాలని విద్యార్థులతో ముఖాముఖి, ఫోన్ఇన్ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సబ్జెక్ట్లలో నిష్ణాతులను నియమించి అనుకున్నది సాధించారు. మ న్ననలు పొందారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్లో క్లబ్లు ఏర్పాటు చేయగా జిల్లా ముందంజలో ఉండటంతో కేంద్రమంత్రులతో అవార్డు అందుకున్నారు. రోగులకు మెరుగైన సేవలందించాలన్న ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీలు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై వేటు వేస్తూ వచ్చారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను సరెండర్ చేసి పాలనను గాడిలో పెట్టారు. హాస్టళ్లలో మెరుగైన విద్య అందాలన్న ఉద్దేశంతో హాస్టల్లో నిద్ర చేయడం, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కొండగట్టు అంజన్న జయంతి వేడుకల్లో ఎండనకా.. వాననకా స్వామివారి సన్నిధిలో ఉంటూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడంతోపాటు, 200 మందికి బుక్స్ సైతం అందించారు. ఇందులో 60 శాతం మంది ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయం. అందులో ఆరుగురు గ్రూప్–1 సాధించగా వారికి ల్యాప్టాప్లు అందించారు.
రైతులకు అండగా..
రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యటిస్తూ అన్ని చర్యలు చేపట్టారు. వారికి గన్నీ బ్యాగ్స్ గానీ, లోడింగ్, అన్లోడింగ్ చేసుకునేలా చూశారు. సకాలంలో ధాన్యం డబ్బులు చెల్లించేలా చూశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు.
పకడ్బందీగా భూభారతి
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో రాష్ట్రంలోనే బుగ్గారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా అక్కడ పూర్తిస్థాయిలో నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేశారు. మళ్లీ జిల్లా మొత్తం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ప్రతి రంగంలో కలెక్టర్ అన్ని చర్యలు తీసుకుంటూ తన మార్క్ను ప్రదర్శిస్తున్నారు.
అందరి సహకారంతో..
అధికారులందరి సమష్ట కృషితో సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చుతూ జిల్లాను ముందు వరుసలో ఉంచుతున్నామని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది అయిన సందర్భంగా ఆయనను సోమవారం పలువురు అభినందించారు. జిల్లా ముందంజలో ఉండేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, డీపీవో మదన్మోహన్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ పాలన @ ఏడాది