
కుంకుమ పూజలో ఎమ్మెల్సీ కవిత
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని నవదుర్గా శక్తిపీఠం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన కుంకుమపూజల్లో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. మహిళలతో కలిసి అమ్మవారి కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఆమెకు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. అమ్మవారి కృపతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అర్చకులు విషుశర్మ, జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత, నాయకులు గట్టు సతీష్ తదితరులు ఉన్నారు.