పరిహారంతో పాటు ఇంటి స్థలం | - | Sakshi
Sakshi News home page

పరిహారంతో పాటు ఇంటి స్థలం

Oct 9 2025 8:04 AM | Updated on Oct 9 2025 8:04 AM

పరిహారంతో పాటు ఇంటి స్థలం

పరిహారంతో పాటు ఇంటి స్థలం

పరిహారంతో పాటు ఇంటి స్థలం

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఎల్మినేడులో టీజీఐఐసీకి భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్‌ రాజు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, టీజీఐఐసీ అధికారుల సమక్షంలో బుధవారం భూనిర్వాసితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. పరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వాలని బాధితులు కోరారు. పరిహారం తీసుకున్న వారి జాబితాలో కొంత మంది అనర్హులు ఉన్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎల్మినేడులో వెంచర్‌ ఏర్పాటు చేసి పరిహారంతో పాటు ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లీగల్‌ టీం సభ్యుడు శ్రావన్‌, ఎల్మినేడు భూ కమిటీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, మహేందర్‌, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement