
సీబీఎస్లో ఆర్టీసీ టికెట్ బుకింగ్ కేంద్రం
సాక్షి, సిటీబ్యూరో: గౌలిగూడలోని సెంట్రల్ బస్టేషన్లో ఆర్టీసీ టికెట్ బుకింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత గురువారం దీనిని ప్రారంభించారు. ఈ కౌంటర్ ద్వారా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు బెంగళూరు, చైన్నె, ముంబై, పుణె తదితర ప్రధాన నగరాలకు సైతం రిజర్వేషన్లు చేసుకోవచ్చని ఆమె వివరించారు. ప్రయాణికులు ఈ కొత్త కౌంటర్ ద్వారా ముందస్తు టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని వినియోగించుకొని, సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని సూచించారు.