ఏసీబీ వలలో మహిళా పీఎస్‌ ఎస్‌ఐ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో మహిళా పీఎస్‌ ఎస్‌ఐ

Jul 11 2025 12:47 PM | Updated on Jul 11 2025 12:47 PM

ఏసీబీ వలలో మహిళా పీఎస్‌ ఎస్‌ఐ

ఏసీబీ వలలో మహిళా పీఎస్‌ ఎస్‌ఐ

గచ్చిబౌలి: ఓ కేసులో పేరు తొలగించేందుకు డబ్బులు తీసుకుంటూ గచ్చిబౌలి ఉమెన్‌ పీఎస్‌ ఎస్‌ఐ వేణుగోపాల్‌ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే..కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భర్తతో పాటు అత్తింటి వారిపై గచ్చిబౌలి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు పక్షాలను పిలిచి మాట్లాడారు. గృహహింస కేసులో తల్లి పేరును తొలగించేందుకు ఎస్‌ఐ వేణు గోపాల్‌ రూ.25 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో సదరు మహిళ భర్త ఏసీబీ అధికారులను అశ్రయించారు. గురువారం మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ వేణుగోపాల్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేసిన పోలీసులు అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement