ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి

Aug 18 2023 4:00 AM | Updated on Aug 18 2023 6:56 AM

- - Sakshi

హఫీజ్‌పేట్‌ : రెండో అంతస్థుపై నుంచి కిందపడి ప్రమాదవశాత్తు గర్భిణి మృతి చెందిన సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ పాలవెల్లి తెలిపిన ప్రకారం.. లింగంపల్లి గ్రామంలోని వెంకట్‌రెడ్డి కాలనీకి చెందిన వెంకట్‌రెడ్డి అన్న కూతురు శ్రీనిఖకు గతేడాది డిసెంబర్‌లో వివాహమైంది. ఆమె ఇప్పుడు ఐదు నెలల గర్భిణి. కాగా రెండు రోజుల క్రితం కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో చెకప్‌ కోసం తన బాబాయ్‌ ఇంటికి వచ్చింది. వీరు మూడంతస్తుల భవనంలోని రెండవ అంతస్తులో ఉంటున్నారు.

గురువారం ఉదయం 7.10 గంటలకు శ్రీనిఖ నిద్రలేచి బాల్కనిలోకి వచ్చి వాకింగ్‌ చేసింది. కొద్దిసేపటికి కళ్లు తిరుగుతున్నాయని చెప్పగా ఆమె పిన్ని ఇంట్లోకి వెళ్లమని సూచించి కిందకు దిగింది. ఇంతలోనే శ్రీనిఖ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే మదీనాగూడలోని శ్రీకర ఆసుప్రతికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని చందానగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్తాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement