అభ్యంతరాలు ఉంటే తెలపండి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో రూపొందించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో ముసాయిదా ఓటరు జాబితా రూపొందించామన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 8వ తేదీ లోగా తెలపాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి ఈ నెల 10న తుది ఓటరు జాబితా వెలువరిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మున్సిపల్ కమిషనర్లు సుధీర్కుమార్, భాస్కర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు హరిశంకర్, సయ్యద్ ఫైజుల్లా, రజనీకాంత్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.


