బడికి.. రారండోయ్‌! | - | Sakshi
Sakshi News home page

బడికి.. రారండోయ్‌!

Jun 12 2025 2:55 AM | Updated on Jun 12 2025 2:55 AM

బడికి

బడికి.. రారండోయ్‌!

ఆటపాటలకు సెలవు..

ఇక పుస్తకాలతో కుస్తీ

పాఠ్యపుస్తకాలు,

స్కూల్‌ యూనిఫామ్‌ సిద్ధం

ఈసారి వేసవిలోనే

టీచర్లకు శిక్షణ పూర్తి

డీఈఓ మొదలు కిందిస్థాయి

సిబ్బందికి సైతం..

వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లోని పలు పాఠశాలల్లో పండుగ

వాతావరణంలో స్వాగత కార్యక్రమాలు

విద్యారణ్యపురి:

వేసవి సెలవులు ముగిశాయి. ఇన్నాళ్లు ఆట పాటలతో గడిపిన విద్యార్థులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. పుస్తకాలతో కుస్తీ షురూ కానుంది. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు కూడా కొద్దిరోజులుగా సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు మొదటిరోజు పిల్లలను పండుగ వాతావరణంలో పాఠశాలల్లోకి ఆహ్వానించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పచ్చని మామిడితోరణాలు, పూలతో అందంగా అలంకరించారు. మొదటిరోజు నుంచే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, జత యూనిఫామ్‌ ఇవ్వనున్నారు.

డీఈఓ నుంచి ఉపాధ్యాయులు,

ప్రతి విభాగం సిబ్బంది వరకు..

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఈసారి సమగ్రశిక్ష ద్వారా డీఈఓల నుంచి ఎంఈఓలు, ఉపాధ్యాయులు, చివరికి వంట మనుషుల వరకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చింది. ఒక్కో టీచర్‌కు ఐదు రోజులపాటు శిక్షణ పూర్తిచేసింది.విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేలా, ఐసీటీ టూల్స్‌ ద్వారా విద్యాభోధన చేసేలా, ఏఐ ఆధారిత విద్యాబోధన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికులకు సుచి, శుభ్రతగా వంటలు చేయడంపై, పారిశుద్ధ్య కార్మికులకు పరిసరాల పరిశుభ్రతపై శిక్షణ ఇచ్చారు.

పండుగ వాతావరణంలోస్వాగత కార్యక్రమాలు

హనుమకొండ జిల్లాలో 14 మండలాల్లోని ఒక్కో పాఠశాలలో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు స్వాగత కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డీఈఓ వాసంతి ఆయా ఎంఈఓలను ఆదేశించారు. విద్యార్థి పాఠశాలలోకి ప్రవేశించగానే పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలు, బెలూన్లు, పూలతో అలంకరించారు. మొదటిరోజు తల్లిదండ్రులను కూడా ఆహ్వానిస్తున్నారు.

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

టీచర్లు సమయపాలన పాటించాలి

పాఠశాలలు పునఃప్రారంభం రోజున టీచర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలి. ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు కొనసాగించాల్సి ఉంటుంది. బడిబాట ఉదయం 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించాలి. విద్యార్థుల నమోదు పెంచాలి. ఆ తర్వాత యఽథావిధిగా పాఠశాల విధుల్లో ఉండాలి. తరగతి గదుల్లో సెల్‌ఫోన్లు వినియోగించకూడదు.

డి.వాసంతి, హనుమకొండ డీఈఓ

బడికి.. రారండోయ్‌!1
1/2

బడికి.. రారండోయ్‌!

బడికి.. రారండోయ్‌!2
2/2

బడికి.. రారండోయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement