
భూ కబ్జాదారుల ఆగడాలకు ఒకరి బలి
ఖిలా వరంగల్: భూ కబ్జాదారుల ఆగడాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మిల్స్కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్కు చెందిన పోలపాక కుమారస్వామి (55) ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారసత్వంగా సంక్రమించిన భూమిని అమ్ముకోగా, మిగిలిన 14 గుంటల భూమిని ముగ్గురు.. బండి కుమారస్వామి, పులి రజనీకాంత్, తాళ్ల మల్లేశం కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. ఆ భూమి తనదేనని పోలెపాక కుమారస్వామి పత్రాలతో వెళ్తే ఎస్సీ, ఎస్టీ పేరుతో దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్ప డ్డారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కుమారస్వామి ఈనెల 9న తన భూమి వద్దకు వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 80 శాతం కాలిన గాయాలయ్యాయి. వెంటనే బంధువులు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం చనిపోయాడు. మృతుడి కుమారుడు రాంకుమార్ ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి