నాటక రంగాన్ని భావితరాలకు అందించాలి | - | Sakshi
Sakshi News home page

నాటక రంగాన్ని భావితరాలకు అందించాలి

Jun 16 2025 5:04 AM | Updated on Jun 16 2025 5:04 AM

నాటక రంగాన్ని భావితరాలకు అందించాలి

నాటక రంగాన్ని భావితరాలకు అందించాలి

హన్మకొండ కల్చరల్‌ : నాటక రంగాన్ని భావితరాలకు అందించాలని, కళాకారులను ప్రోత్సహిస్తూ దాతలు సహకరించాలని కేంద్ర ఖాదీ చిన్నపరిశ్రమల మాజీ డైరెక్టర్‌ ఈగ మల్లేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌ సౌజన్యంతో వరంగల్‌ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. సాయంత్రం వరంగల్‌ పోతన విజ్ఞానపీఠం ఆడిటోరియంలో ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈగ మల్లేశం పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి నాటిక పోటీలను ప్రారంభించారు. అతిథులుగా కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వి.రామచంద్రం, డా.శ్రీరామోజు సుందరమూర్తి, రచయిత వడ్డేపల్లి నర్సింగరావు, వేదిక సలహాదారు పొగాకు రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎస్‌ఆర్‌ మూర్తి పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా రంగస్థల కళాకారులు కుసుమ సుధాకర్‌, సాదుల సురేశ్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం హైదరాబాద్‌ గోవాడ క్రియేషన్స్‌ వారు అమ్మ చెక్కిన బొమ్మ, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్‌ వారి కిడ్నాప్‌ నాటిక ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో రంగస్థల కళాకారులు జేఎన్‌ శర్మ, బిటవరం శ్రీధరస్వామి, సుధాకర్‌, విజయరాజ్‌, జూలూరు నాగరాజు, సంజయ్‌బాబు, ఆకుల సదానందం ఓడపల్లి చక్రపాణి పాల్గొన్నారు.

కేంద్ర ఖాదీ చిన్నపరిశ్రమల

మాజీ డైరెక్టర్‌ ఈగ మల్లేశం

ముగిసిన జాతీయస్థాయి

ఆహ్వాన నాటిక పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement