నేడు ‘గ్రేటర్‌’ గ్రీవెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘గ్రేటర్‌’ గ్రీవెన్స్‌

Jun 16 2025 5:03 AM | Updated on Jun 16 2025 5:03 AM

నేడు

నేడు ‘గ్రేటర్‌’ గ్రీవెన్స్‌

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ నగరంలో సమస్యల పరిష్కారానికి సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్‌ కమిషనర్‌ జోనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ సెల్‌ చక్కటి వేదిక అని, వినియోగించుకోవాలని కోరారు.

లా సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సు ఆరో సెమిస్టర్‌, ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల కోర్సు టెన్త్‌ సెమిస్టర్‌ పరీక్షలు (రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) ఫీజు చెల్లించేందుకు ఈనెల 20 వరకు గడువు ఉందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసీం ఇక్బాల్‌ తెలిపారు. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 23 వరకు ఫీజు చెల్లించుకోవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌లో చూడవచ్చని వారు సూచించారు.

శ్రీరాం అష్టావధానం విజయవంతం

విద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ హైస్కూల్‌లో కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షర తెలుగు అవధానంలో ‘తె అక్షర ముష్టికా కథనం’ అనే సరికొత్త అంశాన్ని కంది శంకరయ్య ప్రవేశపెట్టగా చేపూరి శ్రీరాం విజయవంతంగా పూరించారు. అంశం అచ్చుల్లో ఉండగా సరైన హల్లులతో పూరించారు. అనంతరం చేపూరి శ్రీరాంను విద్యావికాస పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయ శర్మ, శతావధాని, చెన్నూరు డిగ్రీ కాళాశాల ప్రిన్సిపాల్‌ వెంకట రమణ పట్వర్ధన్‌, శతాశధాని మురళి అభినందించారు. ఈసందర్భంగా పద్యకవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజా మనోహర్‌బాబు, దహగం సాంబమూర్తి, నున్నపురాజు రమేశ్వర్‌రాజు, అక్కెర కరుణాసాగర్‌, కొండా యాదగిరి, గుంటి విష్ణుమూర్తి, వెలుగు ప్రభాకర్‌, సిద్దంకి బాబు పాల్గొన్నారు.

గవర్నర్‌ చేతుల మీదుగా సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌కు అవార్డు

వరంగల్‌ క్రైం: అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసేందుకు ప్రోత్సహించినందుకుగాను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఆదివారం రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రెడ్‌క్రాస్‌ అవార్డు ప్రదానం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ హై బ్లడ్‌ డోనర్‌ మోటివేటర్‌ అవార్డు అందుకున్నారు.

డాక్టర్‌ విజయ్‌చందర్‌రెడ్డికి అవార్డు

ఎంజీఎం: తెలంగాణ వ్యాప్తంగా నిబద్ధతతో వైద్య సేవలందించిన అత్యుత్తమ 500 మంది వైద్యులను గౌరవిస్తూ ఓ ప్రైవేట్‌ టీవీ ఆధ్వర్యంలో బిగ్గెస్ట్‌ డాక్టర్‌ అవార్డు–500 కార్యక్రమం నిర్వహించగా.. హనుమకొండకు చెందిన సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి ఎంపికయ్యారు. వైద్యవృత్తిలో నాలుగు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన విజయ్‌చందర్‌రెడ్డి కేఎంసీలో ప్రొఫెసర్‌గా, ఆర్‌వీఎం కళాశాలలో హెచ్‌ఓడీగా, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌గా ప్రజలకు సేవలందిస్తూ వచ్చారు. ఐఎంఏ జాతీయ కార్యవర్గ సభ్యులుగా, దక్షిణ భారతదేశ ఆర్థోపెడిక్‌ సర్జన్ల సంఘం ప్రెసిండెంట్‌గా బాధ్యతలు సైతం నిర్వర్తిస్తున్నారు. ఈఅవార్డును ఆదివారం హైదరాబాద్‌లో ఆయన స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు దక్కిన ఈ గుర్తింపు యువ వైద్యుల్లో స్ఫూర్తి నింపుతుందన్నారు.

నేడు ‘గ్రేటర్‌’ గ్రీవెన్స్‌
1
1/2

నేడు ‘గ్రేటర్‌’ గ్రీవెన్స్‌

నేడు ‘గ్రేటర్‌’ గ్రీవెన్స్‌
2
2/2

నేడు ‘గ్రేటర్‌’ గ్రీవెన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement