
పిల్లర్ల దశలోనే డైనింగ్ హాల్..
హసన్పర్తిలోని బాలుర ఉన్నత పాఠశాలలో రూ.14.38 లక్షలతో చేపట్టిన డైనింగ్ హాల్ నిర్మాణం పిల్లర్లకే పరిమితమైంది. రూ.7.66 లక్షలతో పలు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. రెండు గదుల్లో ఫ్లోరింగ్ పూర్తయ్యిందని ఏఈ తెలిపారు. విద్యుత్ వైరింగ్ చేసి ఫ్యాన్లు బిగించారు. రూ.61 వేలతో తాగునీరు, రూ.3.66 లక్షలతో కిచెన్ షెడ్, రూ.3.28 లక్షలతో చేపట్టాల్సిన టాయిలెట్స్ నిర్మాణ పనులు ప్రారంభంకాలేదు. 120 మంది విద్యార్థులు ప్రస్తుతం ఉన్న టాయిలెట్లను వినియోగించుకోవాల్సిందే.
న్యూస్రీల్