
జిల్లా వ్యాప్తంగా యోగసనాల కార్యక్రమం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం 5 లక్షల మందితో జిల్లా వ్యాప్తంగా యోగాసనాల కార్యక్రమం చేపడుతున్నాం. దీనికోసం 4,814 ప్రదేశాలను ఎంపిక చేశాం. ఇప్పటికే 5 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. గత నెల రోజల నుంచి జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర–2025 లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు మంచి ప్రాచుర్యం పొందాయి. పాఠశాలల దగ్గర్నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చిన్నారులు బాగా ఆసనాలు వేయడం గమనించాను. వారికి ఇప్పటి నుంచే ఆరోగ్యంపై అవగాహన పెంచాలి.
–ఎస్.నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్