
ఐటీఐ రెండో విడత కౌన్సెలింగ్కు దరఖాస్తుల ఆహ్వానం
తెనాలి అర్బన్: జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో రెండో విడత ప్రవేశాల కోసం ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలైనట్లు తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 15వ తేదీలోపు దరఖాస్తులను జ్టీజీ. ్చఞ. జౌఠి. జీుఽ వైబ్సైట్లో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం తెనాలి, గుంటూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో జూలై 15వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. జూలై 21న ఉదయం 9గంటలకు తెనాలి, గుంటూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 250 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని పది ప్రైవేటు కళాశాలల్లో ఖాళీగా ఉన్న 1,070 సీట్లకు జూలై 23, 24,25 తేదీల్లో కౌన్సెలింగ్ జరుగుతుందని తెలియజేశారు. వివరాలకు 63045 72793, 93914 02684లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు సంప్రదించాలని ఆయన సూచించారు.
కులధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు
రాష్ట్ర బేడ బుడగ జంగం ఐక్యవేదిక జేఏసీ వ్యవస్థాపకులు శ్రీనివాస్
లక్ష్మీపురం: రాష్ట్రంలో బేడ బుడగ జంగం కులస్తులు 20 సంవత్సరాల నుంచి కుల ధ్రువీకరణ పత్రాలు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర బేడ బుడగ జంగం ఐక్యవేదిక జేఏసీ వ్యవస్థాపకులు కడమంచి శ్రీనివాన్ తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే ఎస్సీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని ఆయన కోరారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించి, బిల్లు పాస్ చేయించి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఎంతటి పోరాటాలకై నా సిద్ధపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పాల్గొన్నారు.