
నిత్య జీవితంలో యోగా అంతర్భాగం కావాలి
గుంటూరు ఎడ్యుకేషన్: నిత్య జీవితంలో యోగా అంతర్భాగం కావాలని టీజేపీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి పేర్కొన్నారు. పట్టాభిపురంలోని కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు భారతదేశం ఇచ్చిన గొప్పవరం యోగా అన్నారు. శ్వాసపై నియంత్రణ కలిగి, ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా జీవితాన్ని పొందగలరని తెలిపారు. కార్యక్రమంలో పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. అనితాదేవి, వైస్ ప్రిన్సిపాల్ భానుమురళి, గుంటూరు జిల్లా ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి జేవీ సుధీర్కుమార్, ఎన్సీసీ అధికారి మేజర్ పి. కుమార్ రాజా, పీడీలు ఆర్. శివాజీ, వాసుదేవరావు పాల్గొన్నారు.
●అమరావతి రోడ్డులోని శారదా స్కూల్లో విద్యార్థుల యోగా అక్షరమాల ఆకృతిలో కూర్చుని సాధన చేశారు. ఈ సందర్భంగా యోగా మాస్టారు జల్లేపల్లి వెంకటేశ్వరరావు విద్యార్థులకు యోగా ప్రాధాన్యతను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్.ఎం. దాస్, డైరెక్టర్ వి.భారతీవాణి పాల్గొన్నారు.