
అందని ద్రాక్షగా హజ్ యాత్ర
ఆకివీడు: హజ్ యాత్రను కూటమి ప్రభుత్వం అందని ద్రాక్షగా మార్చివేసిందని వైఎస్సార్సీపీ ముస్లిం విభాగం నాయకులు ఎండీ. జక్కీ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ హజ్ యాత్రకు రూ.లక్ష ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోసగించిందన్నారు. రాష్ట్రంలోని ముస్లింలందరూ హజ్ యత్రకు వెళ్లవచ్చని ఆశపడ్డారని వారి ఆశల్ని నిరాశ చేశారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సాధించిన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను కూడా కూటమి ప్రభుత్వం రద్దు చేయించిందన్నారు.