జంగారెడ్డిగూడెం: పొగాకు రైతులు అధైర్య పడవద్దని, పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్ బాబు అన్నారు. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల పరిధిలోని జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, టి.నరసాపురం, జీలుగుమిల్లి మండలాల్లోని వర్జీనియా తోటలను ఆయన పరిశీలించారు. కలెక్టర్, ఆర్డీవోలతో మాట్లాడి పంట నష్టం అంచనాలను వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రం అధికారులను పంట నష్టం అంచనాలు వేసి గుంటూరు కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–1, –2 రైతు సంఘం అధ్యక్షులు సత్రం వెంకట్రావు, పరిమి రాంబాబు మాట్లాడుతూ భారీ వర్షాలు, వడగండ్లకు వేలాది ఎకరాలు దెబ్బతిని రైతులు నష్టపోయారన్నారు. టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో వడగండ్లు పడి ఆకు మొత్తం పాడైపోయిందన్నారు. ఈ ఏడాది మంచి ధర పలుకుతుందని, సమస్యలు గట్టెక్కుతాయని భావించి పెట్టుబడులు పెట్టిన రైతులకు ఈ వర్షాలు నష్టాన్ని కలిగించాయన్నారు. ఆకు రెల్పు ప్రారంభం కాని తోటలు చెరువులుగా మారగా, ఈదురు గాలులకు క్యూరింగ్ జరుగుతున్న బ్యారన్ రేకులు ఎగిరిపోయి పొగాకు తడిచిపోయిందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.3 లక్షలు అందించి ఆదుకోవాలని కోరుతూ పొగాకు బోర్డు ఈడీ శ్రీదర్బాబుకు విన్నవించినట్లు తెలిపారు. రైతు నాయకులు కరాటం రెడ్డిబాబు, పరిమి రాంబాబు, సత్రం వెంకటరావు, వామిసెట్టి హరిబాబు, అట్లూరి సతీష్, వీవీఎస్ ప్రకాశరావు, ఎల్లిన వెంకటేశ్వరరావు, బోర్డు సెక్రటరీ, ప్రొడక్షన్ మేనేజర్, ఒంగోలు ఆర్ఎం కృష్ణశ్రీ, రాజమండ్రి ఆర్ఎం డీఎల్కే ప్రసాద్, ఎస్జీవో శకుంతల, జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాల అధికారులు శ్రీహరి, సురేంద్ర, ఎస్జీఓలు సుధీర్, పార్వతి, ఫీల్డ్ ఆఫీసర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సన్న, చిన్నకారు రైతులు పాల్గొన్నారు.
పొగాకు రైతులను ఆదుకుంటాం
Published Wed, Mar 22 2023 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
నేతన్నల ఆప్తబంధువు జగనన్న
బొండాకు ఓటుతో బుద్ధి చెప్పాలి
బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులకు అన్యాయం
వైఎస్సార్ సీపీలోనే బీసీలకు ప్రాధాన్యం
సర్నాల గెలుపునకు సమష్టిగా కృషి చేయాలి
ఆ పాపం బాలశౌరిదే
మేం ఓటేశాం
ప్రమాదంలో ముస్లిం సమాజం
తప్పక చదవండి
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
Advertisement