
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
దేవరపల్లి మండలం
కురుకూరులో కొబ్బరిలో
అంతర పంట కోకో సాగు
కోకో రైతు సంఘ
సమావేశం తీర్మానాలు
నిడదవోలు మండలం కోరుమామిడిలో శనివా రం జిల్లా కోకో రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.
● అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధర ఇవ్వాలి.
● రాష్ట్రంలో కోకో బోర్డు ఏర్పాటు చేయాలి.
● వెంకటరామన్నగూడెంంలో కోకో పరిశోధన కేంద్రం నెలకొల్పాలి.
● రైతుల వద్ద ఉన్న కోకో గింజలను పూర్తిగా కొనుగోలు చేయాలి.
● కంపెనీల సిండికేట్ విధానాన్ని, మోసాలను అరికట్టాలి.
● విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపు చేయాలి.
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోకో రైతులను ఆదుకోవాలి.
దేవరపల్లి: కంపెనీలు సిండికేట్ కావడం.. గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కోకో రైతులు ఈ ఏడాది కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నారు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత పంట కాలంలో ఎకరాకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకూ ఆదాయం రావడంతో మంచి లాభాలు కళ్లజూశారు. కొంత మంది రూ.కోటికి పైగా కూడా ఆదాయం పొందారు. దీంతో, 2024–25 పంట కాలంలో అధిక ధరకు కోకో తోటలు కౌలుకు తీసుకున్నారు. 2022–23లో ఎకరం కౌలు రూ.20 వేల నుంచి రూ.25 వేలుండగా, 2023–24లో అది రూ.30 వేలకు పెరిగింది. అప్పట్లో కిలో గింజలకు మార్కెట్లో రూ.250 నుంచి రూ.275 వరకూ లభించేది. అటువంటిది 2023–24లో కిలో గింజలకు ఏకంగా రూ.1,050 పలకడంతో కోకో రైతుల పంట పండింది. ఈ నేపథ్యంలో 2024–25 పంట కాలానికి ఎకరం తోటను రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షలకు కౌలుకు తీసుకుని సాగు చేశారు. దీనికి అదనంగా సుమారు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకూ పెట్టుబడి పెట్టారు.
పూతలు దెబ్బ తిని.. ధర పతనమై..
జిల్లాలోని రైతులు కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది కౌలుదారులే ఉన్నారు. మార్కెట్ బాగుంటే ప్రధాన పంట కంటే కోకోకు ఎక్కువ ఆదాయం వస్తుంది. గత ఏడాది మార్కెట్ బాగుండి నాలుగు డబ్బులు మిగలడంతో ఎక్కువ మంది రైతులు తోటలను కౌలుకు తీసుకున్నారు. ఒక్కో రైతు 10 నుంచి 20 ఎకరాల కోకో తోటలు కౌలుకు తీసుకున్నారు. అయితే, తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. మంచు ధాటికి రెండు దఫాలు పూతలు దెబ్బ తిన్నాయి. మూడోసారి పూతలు నిలబడినప్పటికీ దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు రెండు మూడు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ధర బాగుంటుందని రైతులు ఆశించారు. కానీ, వారి ఆశలు తల్లకిందులయ్యాయి. ఫిబ్రవరిలో కిలో గింజలకు రూ.800 ధర లభించగా.. కొద్ది రోజుల్లోనే అది రూ.650 తగ్గింది. ఇదే ధర రెండు నెలలు కొనసాగింది. అనంతరం రూ.400 నుంచి రూ.450కి పడిపోయింది. ఇదే సమయంలో కంపెనీలు ముందుకు రాకపోవడంతో కోకో గింజలు రైతుల వద్ద పేరుకుపోయాయి. ఏదో ఒక ధరకు అమ్ముకుందామన్నా కొనుగోలుదారులు రాని పరిస్థితి. ఏటా జిల్లాలోని రైతుల నుంచి క్యాడ్బరీ సంస్థ ఎక్కువగా కోకో గింజలు కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది కొనుగోలు సంస్థలు సిండికేట్ అయి, ధర తగ్గించేయడంతో గత్యంతరం లేక రైతులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేశారు. కోకో గింజలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కోకో రైతు సంఘాలతో మంత్రి కె.అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. కంపెనీలు ఇచ్చే ధరకు అదనంగా కిలోకు రూ.50 ఇవ్వడానికి అంగీకరించారు. రైతుల వద్ద ఉన్న ప్రతి కోకో గింజా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ మేరకు కోకో రైతుల నుంచి వినతులు స్వీకరించడానికి కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. తహసీల్దార్లు, ఉద్యానవన, ఇతర అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి కోకో రైతులు పండించిన పంట వివరాలు సేకరించారు. కానీ, కోకో గింజల ధర మాత్రం పెరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కోకో సాగుకు ఎకరాకు రూ.2 లక్షల వ్యయం
ఆదాయం రూ.1.30 లక్షలు
నష్టం రూ.70 వేలు
పెట్టుబడి రాక కోకో కౌలు రైతుల దిగాలు
మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్
రూ.5 లక్షల నష్టం
కృష్ణంపాలెం వద్ద ఎకరం రూ.లక్ష చొప్పున 10 ఎకరాల కోకో తోట కౌ లుకు తీసుకున్నాను. పెట్టుబడి మరో రూ.5 లక్షలైంది. ఎనిమిదేళ్లుగా ఇదే తోట కౌలుకు తీసు కుని సాగు చేస్తున్నా. గత ఏడాది ఎకరం కౌలు రూ.33 వేలు కాగా, ఈ ఏడాది రూ.లక్ష అయ్యింది. గత ఏడాది ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఎకరాకు 2 నుంచి 2.5 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ధర లేకపోవడంతో ఎకరాకు రూ.1.20 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చింది. పదెకరాలకు సుమారు రూ.5 లక్షల నష్టం వచ్చింది. ఈ ఏడాది కౌలు రైతులు నిండా మునిగారు.
– కేతా నాగరాజు, కౌలు రైతు,
చిక్కాలపాలెం, చాగల్లు మండలం
ధర పతనమైంది
ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది కంపెనీలు సిండికేట్గా మారి రైతులను ఇబ్బందులు పెట్టాయి. సీజన్ ప్రారంభంలో కిలో కోకో గింజల ధర రూ.650 నుంచి రూ.700 వరకూ పలికింది. అనంతరం ధర పతనమైంది. కొనుగోలుదారులు ముందుకు రాలేదు. నాకు 12 ఎకరాల కోకో తోట ఉంది. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కిలో రూ.500కు కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు రూ.450 చెల్లిస్తుండగా, ప్రభుత్వం రూ.50 ఇస్తోంది.
– యలమాటి భాస్కరరావు,
కోకో రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం
అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలి
అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజల ధర రూ.850 ఉంది. కంపెనీలు రూ.450 మాత్రమే చెల్లిస్తూ, రైతులను మోసం చేస్తున్నాయి. ఈ ఏడాది దిగుబడులు తగ్గడంతో పాటు కంపెనీలు సిండికేట్ కావడంతో పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలూ పడ్డాం. వచ్చే ఏడాది కోకోకు మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడిస్తున్న ధర గిట్టుబాటు కాదు. మద్దతు ధర ఇవ్వకపోయినా అంతర్జాతీయ మార్కెట్ ధర ఇస్తే చాలు. నాకు మూడెకరాల భూమి ఉండగా, పదెకరాలు రూ.13 లక్షలకు కౌలుకు తీసుకున్నాను. పెట్టుబడి రూ.7 లక్షలైంది. దిగుబడి ఎకరాకు 3 క్వింటాళ్లు వచ్చింది. ప్రస్తుత ధర ప్రకారం ఎకరాకు రూ.1.50 లక్షలు వస్తున్నాయి. పెట్టుబడి రావడం కష్టం. కిలోకు రూ.650 ఇస్తేనే గిట్టుబాటు అవుతుంది.
– ఉప్పల కాశీ, ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కోకో రైతు సంఘం, కోరుమామిడి
ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
రైతు పండించిన ప్రతి కోకో గింజా కొనుగోలు చేస్తాం. క్షేత్ర స్థాయిలో 1,140 మంది రైతుల వద్ద 331 మెట్రిక్ టన్నుల కోకో గింజలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెలాఖరులోపే రైతుల నుంచి పంట పూర్తిగా సేకరిస్తాం. రైతులు తమ వినతులను నేరుగా లేదా ఫోన్ ద్వారా ప్రత్యేక సెల్కు తెలియజేయవచ్చు.
– పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025