
యోగాంధ్రలో ‘నన్నయ’కు ‘మిరాకిల్’ రికార్డు
రాజానగరం: యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ఆదికవి నన్నయ యూనివర్సిటీని మరో రికార్డు వరించింది. ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని సొంతం చేసుకున్న వర్సిటీకి తాజాగా మిరాకిల్ వరల్డ్ రికార్డు లభించిందని వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. వర్సిటీ ప్రాంగణంలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని ఆమె అందుకున్నారు. గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకూ జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో వర్సిటీ పరిధిలో రికార్డు స్థాయిలో 18,662 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఈ అవార్డు వచ్చిందని వీసీ వివరించారు.