
నేడు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మహాజన సభ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ది ఇన్నీసుపేట కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 107వ సాధారణ మహాజన సభ ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమహేంద్రవరం సాయికృష్ణ థియేటర్ ఎదురుగా మంగళవారపు పేటలో ఉన్న అల్యూమినియం కాస్ట్వేర్ మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ హాలులో జరుగుతుంది. ఈ విషయాన్ని ఆ బ్యాంకు చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు (బాబు) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మహాజన సభకు హాజరయ్యే బ్యాంక్ ‘ఎ’ తరగతి సభ్యులు బ్యాంక్ మెంబర్ షిప్ కార్డు, ఖాతా పాస్బుక్ తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. లేకుంటే మహాజన సభకు అనుమతించబడదని తెలిపారు. సభ్యులు తమ చిరునామా, ఫోన్ నంబర్ల మార్పు ఉంటే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
వ్యక్తి దుర్మరణం
మామిడికుదురు: మాకనపాలెం గ్రామంలోని ఆర్అండ్బీ రహదారిపై శనివారం ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మామిడికుదురు శివారు గాలిదేవరపాలేనికి చెందిన బొడ్డపల్లి సత్యనారాయణ (45) సైకిల్పై ఈదరాడ వైపు వెళ్తుండగా, అదే మార్గంలో వెళ్తున్న ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొంది. దీంతో సత్యనారాయణ మృత్యువాడ పడ్డాడు. సత్యనారాయణ వికలాంగుడు, అతను అవివాహితుడు. మృతుడి అన్నయ్య వీరాస్వామి ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నేడు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మహాజన సభ