సుమారు 67 సంవత్సరాల క్రితం కొద్దిమంది ఘనపాఠీలతో నగరంలో సంపూర్ణ ఘనపారాయణ జరిగిందని పెద్దలు చెబుతున్నారు. ఇదే గురుకులంలో విద్యనభ్యసించిన 16 మంది ఘనపాఠీలతో ఈ కార్యక్రమం జరగడం గర్వకారణం. భారతాత్మ బిరుదాన్ని అందుకున్న గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీదత్తాత్రేయ వేదవిద్యాలయం జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది. దీని నిర్వహణను కంచి, శృంగేరీ పీఠాధిపతులు సైతం ప్రశంసించారు. అరుదైన ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం మన బాధ్యత.
– భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు
ఆర్షవైభవానికి దర్పణంగా..
వేదం చెప్పినదే ధర్మం. మనకు తోచింది కాదు. వేదం అపౌరుషేయం, అనాది, స్వతః ప్రమాణం గలది. వేద విద్యను పరిరక్షించుకోకపోతే, జగత్తుకే రక్షణ లేదు. వేదం ఐహిక, ఆముష్మిక శ్రేయస్సును అందించే విద్య. ఈ విద్యను కాపాడుకొని భవిష్యత్తరాలకు అందించే సంకల్పంతో రజతోత్సవ సంవత్సరంలోకి అడుగిడుగున్న శ్రీ దత్తాత్రేయ వేద విద్యాలయంలో జరుగుతున్న ఈ ఉత్కృష్ట కార్యక్రమంలో సెద్ద సంఖ్యలో వేదశాస్త్రాభిమానులు పాల్గొనాలి.
– మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ
అరుదైన కార్యక్రమం