
23 నుంచి మహిళా సర్పంచ్లకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా సర్పంచ్ల శిక్షణ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలేరు జిల్లాలలోని ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇచ్చామన్నారు. వారు ఆయా జిల్లాల్లో ఈ నెల 26 నుంచి సర్పంచ్లకు శిక్షణ ఇస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని సర్పంచ్లకు ఈటీసీలో శిక్షణ ఉంటుందన్నారు. మహిళల హక్కులు, బాధ్యత, సమాజంలో వారి పాత్రపై శిక్షణ నిర్వహిస్తామన్నారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినా వాటిని ఉపయోగించకపోవడంతో వారిలో అవగాహన పెంచడానికి ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు. సర్పంచ్గానే కాకుండా మహిళగా ఆమె చేయవలసిన పనులను తెలియజేస్తామన్నారు.
26 నుంచి ఎంపీపీలకు శిక్షణ...
ఈ నెల 26వ తేదీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఎంపీపీలకు ఈటీసీలో శిక్షణ ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. మండల పరిధిలో గ్రామసభల నిర్వహణ, మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం, జిల్లా పరిషత్తు సమావేశాల్లో వారి పాత్రలపై శిక్షణలో వివరిస్తామన్నారు.