
మోసం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇవ్వడం.. వచ్చాక అమలు చేయకుండా మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 1999 ఎన్నికలు, 2014 ఎన్నికల్లో సైతం బాబు ఇదే పంథా అవలంబించారు. రాష్ట్రంలో రూ.7,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ అవసరమైతే కేవలం రూ.700 కోట్లు విడుదల చేశారు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి చొప్పున ఒక్కొక్కరికి ఏడాదికి రూ.36 వేలు బకాయి పడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంతో మల్టీనేషనల్ కంపెనీలు రాష్ట్రానికి పెట్టుబడులకు రావడం లేదు. ప్రభుత్వం బకాయిపడ్డ భృతి, ఉద్యోగాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
– జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
నిరుద్యోగ భృతి ఇవ్వాలి
అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు, లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం మోసం చేసంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పగల్భాలు పలికింది. ఒక్క ఉద్యోగమూ ఇవ్వకపోగా, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల ఉద్యోగాలు తీసేసింది. నిరుద్యోగ భృతి పేరుతో 2014లో అధికారంలోకి వచ్చిన బాబు.. ఆ ఐదేళ్లు నయా పైసా ఇవ్వకుండా నిరుద్యోగులను వంచన చేశారు.
– కంఠమని రమేష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు
ఫీజు రియంబర్స్మెంట్ ఊసేలేదు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే ఎత్తడం లేదు. వేల మంది పేద విద్యార్థులు నిరీక్షిస్తున్నా పట్టించుకోవడం లేదు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నా.. సీఎం చంద్రబాబుకు పట్టడం లేదు. అసలు ఇస్తారో లేదో కూడా స్పష్టత లేదు. తల్లిదండ్రులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు డబ్బులు తీసుకు వచ్చి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
– మానుకొండ చంద్రబాబు నాయుడు,
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు

మోసం బాబుకు వెన్నతో పెట్టిన విద్య