రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక

Jun 23 2025 6:06 AM | Updated on Jun 23 2025 6:06 AM

రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక

పిఠాపురం: రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు బాల, బాలికలను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ కాలేజీలో ఆదివారం ఎంపిక చేసినట్లు కోచ్‌ పి.లక్ష్మణరావు తెలిపారు. మొత్తం 100 మంది రాగా, ఇందులో 12 మంది బాలురు, 12 మంది బాలికలను పోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు ఈ నెల 28, 29 తేదీల్లో కర్నూలులో జరగనున్న రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున పాల్గొంటారన్నారు. తొలుత ఈ ఎంపిక పోటీలను ఉమ్మడి జిల్లా రగ్బీ అసోసియేషన్‌ చైర్మన్‌ వియ్యపు రమణరాజు, సభ్యులు ఎమ్మిడిశెట్టి నాగేంద్రకుమార్‌, సోము గోవిందరాజు ప్రారంభించారు. న్యాయ నిర్ణేతలుగా సతీష్‌, పీడీ శేషుకుమారి, కె.నాగలింగేశ్వరరావు, సురేష్‌, కె.చిన్నబ్బాయి, పవన్‌ వ్యవహరించారు. ఎంపికై న క్రీడాకారులను డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ బి.శ్రీనివాస్‌కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ మాజీ ఉపాధ్యక్షుడు కె.పద్మనాభం, రగ్బీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దొరబాబు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement