అయోమయం.. గందరగోళం
లోడ్ వెరిఫికేషన్తో ఆన్లైన్లో ఇలాంటి తాకీదులు జిల్లా వ్యాప్తంగా అనేక మంది వినియోగదారులకు వస్తూండటంతో విషయం అర్థం కాక అయోమయంలో పడుతున్నారు. జిల్లాలో గత మార్చి నుంచి ఈ నెల వరకూ దాదాపు 4,250 గృహ సర్వీసులకు అడిషనల్ లోడ్ పేరుతో వీడీఎస్ అమలు చేసినట్లు తెలిసింది. ఈ 4,250 సర్వీసుల నుంచి అదనపు లోడ్ చార్జీల కింద రూ.78 లక్షల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. విద్యుత్ అధికారులు మాత్రం అడిషనల్ లోడ్కు చార్జీలు చెల్లించడం వల్ల వినియోగదారుకే మేలని చెప్పుకొస్తున్నారు. విద్యుత్ వినియోగం వివరాలను ఆన్లైన్లో తెలుసుకునే వెసులుబాటు ఉండటంతో అదనపు లోడ్పై విద్యుత్ కార్యాలయాల నుంచి కేసులు నమోదు చేస్తున్నారు. మరోపక్క స్పెషల్ డ్రైవ్లతో ఇళ్లకు వెళ్లి అదనపు లోడ్ చార్జీలు చెల్లించకపోతే ఫ్యూజ్ తొలగించాల్సి వస్తుందని సిబ్బంది హెచ్చరిస్తున్నారు. మరి కొంతమంది వినియోగదారులకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండానే నేరుగా ఇళ్లకు వెళ్లి ఫ్యూజులు తొలగిస్తున్నారు.
అమలాపురం టౌన్: నిత్య జీవితంలో విద్యుత్ ఓ భాగమైంది.. ఏ పనికై నా ఇది అత్యవసరమైంది.. అలాంటి విద్యుత్ చార్జీలను కూటమి ప్రభుత్వం పెంచి ప్రజల నడ్డివిరిస్తోంది.. ప్రతి నెలా బిల్లులు చూసి షాక్కు గురవుతున్న కొంతమంది వినియోగదారులను అదనపు లోడ్ పేరుతో విద్యుత్ శాఖ బాదేస్తోంది. పలు గృహ సర్వీసులకు వలంటరీ డిస్కొజర్ స్కీమ్ (వీడీఎస్) అంటూ మళ్లీ వడ్డిస్తోంది. లోడ్ వెరిఫికేషన్ పేరుతో ఆన్లైన్ ద్వారా నమోదవుతున్న కేసుల్లో పెరిగిన విద్యుత్ లోడ్ ఆధారంగా కిలో వాట్కు ఇంత అని చార్జీల మోత మోగిస్తుంది. ఇప్పటికే లోడ్ పెరిగితే కొందరు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకుని, విద్యుత్ శాఖ విధించే వీడీఎస్ను విధి లేక చెల్లిస్తున్నారు. ఇది కాకుండా స్పెషల్ డ్రైవ్ పేరుతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అదనపు లోడ్లపై విద్యుత్ శాఖ దాడులు నిర్వహిస్తుంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా ఇంటి కనెక్షన్లు తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే పెరిగిన విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతుండగా.. ఇప్పుడు అదనపు లోడ్ పేరిట స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి, కనెక్షన్లు తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఉప్పలగుప్తం మండలం వానపల్లిపాలెంలో స్పెషల్ డ్రైవ్ పేరుతో ఓ ఇంటి విద్యుత్ కనెక్షన్ను సిబ్బంది గత గురువారం తొలగించారు. విద్యుత్ వాడకానికి కిలోవాట్ల కేటగిరీల వారీగా అడిషనల్ లోడ్ చార్జీ విధిస్తున్నారు. ఇలా కిలో వాట్కు రూ.1,250 చెల్లించాల్సి వస్తోంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.600 వసూలు చేస్తున్నారు. ఇలా కిలోవాట్ల వారీగా చార్జీల భారం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది జరిమానా లాంటిదే. దీనికే వీడీఎస్ అని పేరు పెట్టి ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించే లోడ్ వెరిఫికేషన్లో ఏ వినియోగదారుడైనా కిలోవాట్ల గీత దాటితే వీడీఎస్ కింద రూ.1,250 చొప్పున చెల్లించాలని తాకీదు వస్తోంది. ఉదాహరణకు పి.గన్నవరం మండలానికి చెందిన ఓ వినియోగదారుడికి వీడీఎస్ కింద రూ.2,500 చెల్లించాలని తాకీదు ఇచ్చారు. సాయంత్రంలోగా రూ.2,500 చెల్లించకుంటే మర్నాడు సాయంత్రానికి రూ.4,500 చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అదనపు లోడ్ పేరుతో బాదుడు
వీడీఎస్ ద్వారా రూ.వేలల్లో చార్జీలు
కిలోవాట్ల వారీగా విద్యుత్ శాఖ వడ్డింపు
ఇబ్బంది పెట్టడం సరికాదు
స్పెషల్ డ్రైవ్ పేరుతో విద్యుత్ సిబ్బంది ఒకేసారి ఇంటికి వచ్చి హడావుడి చేస్తున్నారు. దీంతో, ఇంట్లోని వారు అదేదో దాడిలా కంగారు పడుతున్నారు. నా ఇంటికి అదనపు లోడ్ వినియోగించామంటూ సిబ్బంది వచ్చి ఉన్నపళంగా విద్యుత్ కనెక్షన్ తొలగించారు. ఇది సరికాదు. మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు. కరెంట్ లేక రాత్రంతా ఇబ్బంది పడ్డాం. అడిషనల్ చార్జీల వసూళ్లకు ముందుగా నోటీసులిస్తే బాగుంటుంది. ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు.
– దూనబోయిన వెంకటేశ్వరరావు,
వానపల్లిపాలెం, ఉప్పలగుప్తం మండలం
వసూలు చేసే పద్ధతి ఇది కాదు
అదనపు లోడ్ చార్జీల వసూలు కోసం విద్యుత్ శాఖ అధికారులు అనుసరిస్తున్న విధానం సరికాదు. నోటీసులివ్వకుండా కనెక్షన్లు తొలగించడం, స్పెషల్ డ్రైవ్ల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం, గడువులోగా చెల్లించకపోతే రూ.వేలల్లో జరిమానాల మాదిరిగా విధించి, ముక్కుపిండి మరీ వసూలు చేయడం వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే. తొలుత హెచ్చరికలతో చెప్పాలి. అంతకీ మాట వినకపోతే చివరిగా నోటీసు ఇచ్చి కనెక్షన్ తొలగించాలి.
– జీవీఎల్ఎన్ శర్మ,
అధ్యక్షుడు, పట్టణ వినియోగదారుల సంఘం, అమలాపురం
అమ్మో కర్రంటోళ్లు...
అమ్మో కర్రంటోళ్లు...