
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
దేవరపల్లి: గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయడ్డారు. వారిని స్థానికులు చికిత్స కోసం స్థానిక ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వెళ్తున్న కారు దుద్దుకూరు వద్ద అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తుల్లో జావీద్, ఆయాష్ గాయపడగా స్థానికులు హైవే అంబులెన్స్లో వారిని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు.