కోనసీమ కళ .. పూరీలో భళా.. | - | Sakshi
Sakshi News home page

కోనసీమ కళ .. పూరీలో భళా..

Jun 18 2025 3:47 AM | Updated on Jun 18 2025 3:47 AM

కోనసీమ కళ .. పూరీలో భళా..

కోనసీమ కళ .. పూరీలో భళా..

కొత్తపేట: కోనసీమకు చెందిన గరగనాట్యం, వీరనాట్యం కళాబృందాల ప్రదర్శనలకు ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరిగిన ఫోక్‌ ఫైర్‌ ఫెస్టివల్‌ (జానపద జాతర)లో విశేష గుర్తింపు లభించింది. ఆ ఫెస్టివల్‌లో భాగంగా వెస్ట్‌ జోన్‌ కల్చరల్‌ ఉదయ్‌పూర్‌, సౌత్‌ జోన్‌ కల్చరల్‌ తంజావూరు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జానపద జాతర నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్‌ ఆధ్వర్యంలో గరగ నాట్యం, వీరనాట్యం ప్రదర్శనలకు అవకాశం అభించింది. సోమవారం నిర్వహించిన ఆయా ప్రదర్శనల్లో ప్రసాద్‌తో పాటు 20 మంది ఆయా కళాబృందాలు తమ ప్రతిభను ప్రదర్శించి, నిర్వహకులను, ప్రముఖులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ కళాకారులను ముఖ్యంగా టీమ్‌ లీడర్‌ ఏసు వెంకట ప్రసాద్‌.. ఒడిశా హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖల మంత్రి డాక్టర్‌ కృష్ణచంద్ర మహాపత్ర, తదితర ప్రముఖుల అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ తమ బృందాలను గుర్తించి దేశ, విదేశాల్లో అవకాశాలు కల్పి స్తున్న రాష్ట్ర ప్రభుత్వ కల్చరల్‌ సీఈఓ మల్లికార్జునరావుకు కళాబృందాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement