అమలాపురంలో అదృశ్యం.. విశాఖలో ప్రత్యక్షం | - | Sakshi
Sakshi News home page

అమలాపురంలో అదృశ్యం.. విశాఖలో ప్రత్యక్షం

Jun 18 2025 3:47 AM | Updated on Jun 18 2025 3:47 AM

అమలాప

అమలాపురంలో అదృశ్యం.. విశాఖలో ప్రత్యక్షం

అమలాపురం టౌన్‌: అమలాపురం నుంచి రెండు రోజుల కిందట అదృశ్యమైన తల్లీ పిల్లలను (కుమార్తె, కుమారుడు) విశాఖపట్నం మద్దెలపాలెంలో పోలీసులు మంగళవారం ఉదయం గుర్తించారు. తన భర్త పెట్టే వేధింపులు భరించలేకే కన్నబిడ్డలతో కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఈ నెల 15న తల్లీపిల్లల అదృశ్యంపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు తక్షణమే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లో అదృశ్యమైన ఆ కుటుంబాన్ని వెతికి పట్టుకున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. అమలాపురం రూరల్‌ మండలం పేరూరు గ్రామ శివారు దూడలవారి వీధికి చెందిన చవ్వాకుల నరేష్‌ భార్య హారతి (24), కుమార్తె నందన (6), కుమారుడు భార్గవ్‌ (4) ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. హారతి తన బిడ్డలతో తొలుత మామిడికుదురు మండలం లూటుకుర్రులోని తన పుట్టింటికి స్కూటీపై వెళ్లడం, అక్కడ నుంచి అమలాపురం ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు వచ్చి సైకిల్‌ స్టాండ్‌లో స్కూటీని పెట్టి అదృశ్యమైనట్లు పోలీసులు ఆ రోజు రాత్రే గుర్తించారు. విశాఖపట్నం బస్సు ఎక్కి వెళ్లిన ఆమె తన బిడ్దలతో మద్దెలపాలెంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని ఉన్నట్లు అమలాపురం పోలీసుల విచారణలో తేలింది. వారిని విశాఖ నుంచి అమలాపురం తీసుకుని వచ్చి బంధువులకు అప్పగించారు. అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆధ్వర్యంలో పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో ఎస్సై కేఎం జోషి, కానిస్టేబుల్‌ రాయు డు శ్రీను, ఐటీ కోర్‌ విభాగం కానిస్టేబుల్‌ జాఫర్‌ సాంకేతికత ఆధారంగా తల్లీపిల్లలను గుర్తించారు.

తల్లి వద్దకు క్షేమంగా చేరిన బాలిక

కాకినాడ రూరల్‌: చీడిగ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక చల్లా సత్య పావని అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఆ బాలికను మంగళవారం ఇంద్రపాలెం పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులు వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతి చదువుతున్న సత్యపావని సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం పోలీసులు రాత్రి అదృశ్యం కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్‌ సీఐ చైతన్య కృష్ణ, ఎస్సై వీరబాబు ప్రత్యేక బృందాలతో బాలిక కోసం గాలించారు. ఆ బాలిక ముందుగా విజయవాడ వెళ్లి, అక్కడి నుంచి సామర్లకోట వచ్చి, చివరకు రామచంద్రపురంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి ఇంద్రపాలెం తీసుకువచ్చి విచారించగా తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్టు పావని చెప్పింది. దీంతో బాలిక, ఆమె తల్లికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి, అనంతరం అప్పగించారు. కాగా.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్ర మత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

తల్లీపిల్లల ఆచూకీ లభ్యం

భర్త వేధింపులు భరించలేకే

పారిపోయినట్టు వెల్లడి

అమలాపురంలో అదృశ్యం.. విశాఖలో ప్రత్యక్షం 1
1/1

అమలాపురంలో అదృశ్యం.. విశాఖలో ప్రత్యక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement