
‘నన్నయ’ రిజిస్ట్రార్గా సుధాకర్ పదవీ విరమణ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్టార్గా ఆచార్య జి.సుధాకర్ పదవీ విరమణ చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయనను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. ఆమె మాట్లాడుతూ 2023 ఆగస్టు 23 నుంచి రిజిస్ట్రార్గా సుధాకర్ విశిష్ట సేవలందించారన్నారు. ‘నన్నయ’ యూనివర్సిటీ అభివృద్ధిలో ఒక రిజిస్ట్రార్గా భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందని ఆచార్య సుధాకర్ పేర్కొన్నారు. కాగా.. సుధాకర్ ఇక నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో హ్యుమన్ జెనిటిక్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించనున్నారు. ఇదిలావుండగా ‘నన్నయ’ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్గా అకడమిక్ డీన్ ఆచార్య కేవీ స్వామిని నియమిస్తూ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ఉత్తర్వులు జారీ చేశారు.
దేవదాయశాఖ ఆస్తులను పరిరక్షించాలి
బోట్క్లబ్ (కాకినాడ): ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములు, ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురైతే కోర్టులో కేసులు దాఖలు చేయాలని జిల్లా దేవదాయశాఖాధికారి కె.నాగేశ్వరరావు అన్నారు. కాకినాడ నగరంలోని ఆలయ, సత్రాలకు సంబంధించిన ఈవోలతో మంగళవారం ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దేవదాయశాఖకు చెందిన ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా ఆలయ ఈఓ, సత్రాల ఈవోలపైనే ఉందన్నారు. నగరం పరిధిలో ఉన్న ఆలయాలు, సత్రాలకు ఉన్న భూములు, ఖాళీ స్థలాలు అన్నీ ఆన్లైన్లో ఆయా సత్రాలు, ఆలయాల పేరున ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. భూములు ఏమైనా ఆక్రమణలో ఉంటే వాటిని ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆ శాఖ కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్ పాల్గొన్నారు.