రక్త సేకరణలో జేఎన్‌టీయూకేకు అవార్డు | - | Sakshi
Sakshi News home page

రక్త సేకరణలో జేఎన్‌టీయూకేకు అవార్డు

Jun 18 2025 3:29 AM | Updated on Jun 18 2025 3:29 AM

రక్త

రక్త సేకరణలో జేఎన్‌టీయూకేకు అవార్డు

బాలాజీచెరువు: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన రక్త సేకరణలో జేఎన్‌టీయూకే రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి అవార్డును సాధించింది. గుంటూరులో వైద్యశాఖమంత్రి సత్యకుమార్‌యాదవ్‌ ఈ అవార్డును అందజేశారు. మంగళవారం జేఎన్‌టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ తన చాంబర్‌లో అవార్డు అందుకున్న ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ శ్యామ్‌కుమార్‌ను అభినందించారు. 2023–24 ఏడాదికి వర్సిటీ అనుబంధ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్ల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించి అధిక యూనిట్లు సేకరించడం సంతోషమని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. శ్యామ్‌కుమార్‌ను రెక్టార్‌ కేవీ రమణ, రిజిస్ట్రార్‌ రవీంద్ర, ప్రిన్సిపాల్‌ మోహనరావు అభినందించారు.

ఐఎఫ్‌టీ నిర్మాణానికి

రూ.25 కోట్లు విడుదల

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఐఐఎఫ్‌టీ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫారిన్‌ ట్రేడ్‌) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసిందని ఎంపీ తంగేళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తపల్లి మండలం పొన్నాడ వద్ద 229.81 కోట్ల వ్యయంతో నిర్మించే క్యాంపస్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులను గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మంజూరు చేశాయి.

అయినవిల్లికి

పోటెత్తిన భక్తులు

అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకోలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 24 మంది, లక్ష్మీగణపతి హోమంలో 12 జంటలు, స్వామి సన్నిధిలో ఐదుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం, చిన్నారులకు తులాభారం, అన్నప్రాసన నిర్వహించారు. 28 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 1600 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.1,04,571 వచ్చినట్టు ఆలయ ఇన్‌చార్జి ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు.

విద్యా పథకాల

అమలుపై సమీక్ష

అమలాపురం టౌన్‌: విద్యా పథకాల అమలుపై క్షేత్ర స్థాయిలో జరిగే అధ్యయనాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత క్లస్టర్‌ రీసోర్స్‌ మొబైల్‌ టీచర్స్‌ (సీఆర్‌ఎంటీ)పై ఉందని సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ జి.మమ్మీ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లాలోని స్కూల్‌ కాంప్లెక్స్‌ సీఆర్‌ఎంటీలతో సమీక్షించారు. సమగ్ర శిక్షా సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ విద్యా పథకాలపై చర్చించారు. విద్యార్థులకు కిట్ల పంపిణీ, టీచర్ల ట్రైనింగ్‌ తదితర కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మమ్మీ మాట్లాడుతూ విద్యా పథకాల అమలు కోసం సీఆర్‌ఎంటీలు క్షేత్ర స్థాయిలో పాఠశాలలను సందర్శించాలన్నారు. సమగ్ర శిక్షా ఏఎంవో పి.రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 26 వరకూ ప్రధానోపాధ్యాయలకు లీడర్‌ షిప్‌ ట్రైనింగ్‌, ఈ నెల 23 నుంచి 28 వరకూ గతేడాది ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ పొందిన ఒకటో తరగతి బోధన చేసే ఉపాధ్యాయులకు రెండో దశ శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్షా ఏఎస్‌వో కె.నారాయణరావుతో పాటు జిల్లాలోని 22 మండలాల పరిధిలోని స్కూల్‌ కాంప్లెక్స్‌ల సీఆర్‌ఎంటీలు పాల్గొన్నారు.

రక్త సేకరణలో  జేఎన్‌టీయూకేకు అవార్డు 1
1/1

రక్త సేకరణలో జేఎన్‌టీయూకేకు అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement