నిలకడగా డయేరియా రోగుల ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

నిలకడగా డయేరియా రోగుల ఆరోగ్యం

Jun 18 2025 3:29 AM | Updated on Jun 18 2025 3:29 AM

నిలకడ

నిలకడగా డయేరియా రోగుల ఆరోగ్యం

రౌతులపూడి: డయేరియాతో బాధపడుతూ రౌతులపూడి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యాధికారిణి మంగళవారం జానకీదేవి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 44 మందికిగాను ఆరోగ్యం మెరుగుపడిన ఏడుగురిని మంగళవారం డిశ్చార్జి చేయగా సత్యవరం గ్రామానికి చెందిన మరో మూడు డయేరియా కేసులు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 40 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వారందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో జిల్లా రాపిడ్‌ రెస్సాన్స్‌ బృంద సభ్యులు డాక్టర్‌ వి.అరవింద్‌ కుమార్‌, డాక్టర్‌ వి.సత్యచంద్రిక, డాక్టర్‌ ఎస్‌.రుక్మిణీదేవి మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తలు, రోగులు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. మెరుగైన చికిత్స నందించేందుకు అవసరమైన సూచనలను సీహెచ్‌సీ వైద్యులకు సూచించారు. డయేరియా ప్రబలిన సబ్‌ప్లాన్‌ ఏజెన్సీకి చెందిన దబ్బాది, సత్యవరం గ్రామాల్లో తాగునీరు, ఆహార దినుసులు, తదితర శాంపిల్స్‌ను సేకరించేందుకు చర్యలు చేపట్టాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. సీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ పావని పాల్గొన్నారు.

యోగా ప్రయోజనాలపై అవగాహన

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర సాధనలో ‘వన్‌ హెల్త్‌ – వన్‌ ఎర్త్‌ ‘ అనే నినాదంతో మానవాళికి ఆరోగ్యవంతమైన మార్గంలో యోగా సాధన వల్ల చేకూరే ప్రయోజనంపై అవగాహన కల్పిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలోని వై.జంక్షన్‌ వద్ద పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ శానిటేషన్‌ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం యోగాంధ్ర సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో సీతారామమూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4,900 పైగా ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రదేశాల్లో 7,50,000 మంది యోగ సాధకులకు నిత్యం శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు.

డీఆర్‌ఓ సీతారామమూర్తి

నిలకడగా డయేరియా రోగుల ఆరోగ్యం1
1/1

నిలకడగా డయేరియా రోగుల ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement