
బ్రాందీషాపు ఏర్పాటును నిరసిస్తూ ధర్నా
మామిడికుదురు: పెదపట్నం గ్రామంలోని ఏటిగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా బ్రాందీ షాపు ఏర్పాటుకు నిరసనగా సోమవారం స్థానికులు ధర్నా చేశారు. బ్రాందీ షాపు ఎదురుగా నిల్చుని నిరసన తెలిపారు. ఆలయం సమీపంలో నివాస గృహాల వద్ద బ్రాందీషాపు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. గతంలో ఇదే విధంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామన్నారు. అప్పట్లో ఈ షాపును వేరే చోట ఏర్పాటు చేశారని చెప్పారు. మళ్లీ ఇక్కడ బ్రాందీ షాపు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని వల్ల తాము నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. బ్రాందీ షాపు ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణం ఉప సంహరించుకోవాలని నినాదాలు చేశారు. నిరసనలో గెద్దాడ సందీప్, కుక్కల వేణు, గెద్దాడ సావిత్రి, చెల్లింగి సత్యనారాయణ, కుక్కల సక్కుబాయి, ముత్యాల సుబ్రహ్మణ్యం, కుక్కల నాగలక్ష్మి, అరిగెల కృష్ణవేణి, చెల్లింగి వరలక్ష్మి పాల్గొన్నారు.