మార్కెట్‌లోకి సుజుకి కొత్త స్కూటర్‌ | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి సుజుకి కొత్త స్కూటర్‌

Jun 17 2025 5:07 AM | Updated on Jun 17 2025 5:07 AM

మార్కెట్‌లోకి సుజుకి కొత్త స్కూటర్‌

మార్కెట్‌లోకి సుజుకి కొత్త స్కూటర్‌

రాజమహేంద్రవరం రూరల్‌: రాజమహేంద్రవరంలోని కంటిపూడి సుజుకి షోరూంలో సోమవారం కంటిపూడి గ్రూప్‌ చైర్మన్‌ కంటిపూడి సర్వారాయుడు సుజుకి న్యూ యాక్సెస్‌ 125 సీసీటీఎఫ్‌టీ ఎడిషన్‌ స్కూటర్‌ మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూ వీలర్‌ విక్రయ రంగంలో సుజుకి ఆక్సిస్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని. కొత్తగా లాంచ్‌ చేసిన టీఎఫ్‌టీ వాహనానికి సరికొత్త హంగులు, అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు. కలర్‌ డిజిటల్‌ మీటర్‌, వెదర్‌ అలర్ట్‌, నావిగేషన్‌, మెసేజ్‌ అలర్ట్‌, వాట్సాప్‌ కాల్‌, మైలేజ్‌ రేంజ్‌, డెమో నైట్‌ మోడ్‌ లాస్ట్‌ పార్కింగ్‌ అలర్ట్‌, స్పీడ్‌ ఎక్సీడింగ్‌ అలెర్ట్‌ వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ స్కూటీ అన్ని వర్గాలతో పాటు యువతకు ఆకర్షణీయంగా ఉంటుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైందని, డ్రైవింగ్‌కు సులువైందని నాణ్యతలో సాటిలేని స్కూటర్‌ అని అన్నారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.వినయ్‌బాబు, ఎం.జగన్‌, సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.మన్మోహన్‌రామ్‌, జి.ఎం రాజారావు, కస్టమర్లు, నగర ప్రముఖులు, షోరూమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement