
1,268 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: తణుకు నుంచి జగ్గంపేటకు అక్రమంగా రవాణా చేస్తున్న 1,268 కిలోల రేషన్ బియ్యం రాజానగరంలో గురువారం పట్టుబడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక వాహనంలో 32 ప్లాస్టిక్ సంచుల్లో మూటలుగా కట్టి రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించి, స్వాధీన పర్చుకున్నారు. బియ్యం విలువ రూ.58,328 కాగా, వాహనం విలువ రూ.1.50 లక్షలుగా అంచనా వేశామని స్థానిక ఎంఎస్ఓ బాపిరాజు తెలిపారు. వాహన యజమాని అయిన జగ్గంపేటకు చెందిన మారిశెట్టి గణేష్.. డ్రైవర్ జి.సత్తిబాబు సాయంతో ఈ బియ్యాన్ని తరలిస్తున్నాడన్నారు. నిందితులను పోలీసులకు అప్పగించి, 6ఏ కేసు నమోదు చేశామన్నారు.