సాక్షి, రాజమహేంద్రవరం: తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న అనేక కుటుంబాలకు ద్రోహం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికీ ఎటువంటి నిబంధనలూ లేకుండా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు చెప్పారు. ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు’ అంటూ గొప్పగా ప్రచారం చేశారు. తీరా అమలు చేయాల్సి వచ్చేసరికి కూటమి సర్కారు అనేక నిబంధనలతో ఆంక్షలు పెట్టింది. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 1,88,226 మంది విద్యార్థులున్నారు. వీరిలో 1,23,779 మందిని అర్హులుగా గుర్తించి వారి తల్లుల ఖాతాల్లో రూ.240 కోట్లు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారమే 64,447 మందికి మొండిచేయి చూపారు. ఇదిలా ఉండగా జిల్లాలో సుమారు 2.80 లక్షల మంది విద్యార్థులున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే ఎంత మంది విద్యార్థులు ఈ పథకానికి దూరమయ్యారో అర్థం చేసుకోవచ్చు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా 1.62 లక్షల మంది విద్యార్థులకు ఒక్క అమ్మ ఒడి పథకం ద్వారానే రూ.243 కోట్లు జమ చేసేవారు. ఇలా నాలుగేళ్ల పాటు నిరంతరాయంగా అందించారు. ఇది కాకుండా ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు జగనన్న విద్యా, వసతి దీవెనల పేరుతో ఫీజు రీయింబర్స్మెంట్ అందజేశారు.
ఇవీ నిబంధనలు
● ఒకే ఇంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందితే ఆ ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం డబ్బులు ఇవ్వరు.
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు పొందే వారికి ఈ పథకం వర్తించదు.
● బియ్యం కార్డు లేకపోతే పథకం రాదు.
● కుటుంబం నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం వర్తించదు.
● మాగాణి మూడెకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలు మించకూడదు.
● పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు.
● ప్రతి కుటుంబానికీ ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం వర్తింపజేయరు.
● ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారికి పథకం వర్తించదు. ఈ ఆంక్షలతో జిల్లాలో వేలాది మంది తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు.
వీరు కూడా దూరం
సీబీఎస్ఈతో పాటు వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు తల్లికి వందనం జాబితాలో కనుమరుగయ్యాయి. గత విద్యా సంవత్సరంలో టెన్త్, సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ డబ్బులు ఇవ్వలేదు. టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరితేనే వారికి లబ్ధి కలుగుతుంది. సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులను అనర్హుల్ని చేశారు.
నాడు తప్పు.. నేడు ఒప్పా?
ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.2 వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మినహాయించినట్లు తెలిపింది. ఈ నిధులు జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంచే విధంగా జీఓలో పేర్కొంది. ఇదే పని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తే నాడు కూటమి నేతలు బురద జల్లారు. ఇలా చేయడం నాడు తప్పని చెప్పినప్పుడు ఇప్పుడు ఎలా ఒప్పవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తల్లికి వందనం డబ్బులు రాని
అంబేద్కర్
కుటుంబ
సభ్యులు
తల్లికి వందనం పథకానికి ని‘బంధనాలు’
ఆదాయం, విద్యుత్ వినియోగం
పేరిట అనర్హత వేటు
జిల్లాలో 64,447 వేల మంది
పరిస్థితి అగమ్యగోచరం
అర్హత ఉన్నా వేటు
నిడదవోలు మండలానికి చెందిన వడల రత్నకుమారి, అంబేద్కర్ దంపతుల పిల్లలు రిషిత (8వ తరగతి), వెంకట్ రిషి (6వ తరగతి) ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈ కుటుంబం ఎస్సీ కేటగిరీ కింద విద్యుత్ వినియోగిస్తోంది. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ఎస్సీలకు ఉచిత విద్యు త్ నాలుగేళ్లుగా అమలవుతోంది. దీంతో, వీరు 300 యూనిట్ల విద్యుత్ బిల్లు వినియో గం ఆంక్షల పరిధిలోకి రారు. అయినప్పటికీ ఈ కుటుంబం 300 యూనిట్ల విద్యుత్ వాడినట్లు చూపించి, తల్లికి వందనం పథకానికి అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో ఇద్దరు పిల్లలకూ నయాపైసా కూడా జమ కాలేదు. దీని పై ఆ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఈ కుటుంబమే కాదు.. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
తల్లికి వంచన
తల్లికి వంచన