ట్రాక్‌పై జల్సా.. ట్రైన్‌ రావడంతో | Two Persons Lost Life By Hitting Train In Eluru Railway Station | Sakshi
Sakshi News home page

రైలు‌ వస్తున్న సంగతి మరిచి..

Jan 23 2021 9:04 AM | Updated on Jan 23 2021 3:25 PM

Two Persons Lost Life By Hitting Train In Eluru Railway Station - Sakshi

మద్యం మత్తులో ఉన్న  ముగ్గురూ రైలు వస్తున్న సంగతి మరచి ట్రాక్‌పై అలాగే కూర్చుండిపోవడంతో వారిపై నుంచి ట్రైన్‌ దూసుకుపోయింది. 

సాక్షి, పశ్చిమ గోదావరి: జిల్లాలోని ఏలూరు టౌన్‌లో విషాదం నెలకొంది. రైల్వే ట్రాక్‌పై మద్యం సేవించి మత్తులో మునిగిపోయిన ముగ్గురు యువకులను వేగంగా వచ్చిన ట్రైన్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తంగెళ్లముడికి చెందిన సిద్దూ(23), కొత్తపేటకు చెందిన భరత్‌(25), పవన్‌లు ఏలూరు బస్టాండ్‌ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ పైకి చేరుకొని గతరాత్రి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న  ముగ్గురూ రైలు వస్తున్న సంగతి మరచి ట్రాక్‌పై అలాగే కూర్చుండిపోవడంతో వారిపై నుంచి ట్రైన్‌ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో భరత్‌, సిద్దూలు మరణించగా.. పవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పవన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement