ఏడుగురు యువకుల కిడ్నాప్ కథ సుఖాంతం | Sakshi
Sakshi News home page

ఏడుగురు యువకుల కిడ్నాప్ కథ సుఖాంతం

Published Wed, Jul 21 2021 12:39 PM

Seven People Kidnapped Story End In Chhattisgarh - Sakshi

ఛత్తీస్‌గఢ్: కుందేడ్ గ్రామంలో కలకలం రేపిన ఏడుగురు యువకుల కిడ్నాప్‌ కథ సుఖాతం అయింది. రెండు రోజుల క్రితం సుక్మా జిల్లాలోని జేగురుకొండ పోలీసు స్టేషన్‌ పరిధిలో కుందేడ్‌ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను మావోయిస్టులు కిడ్నాప్‌ చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే బుధవారం ఆ యువకులు సురక్షితంగా ఇంటికి రావటంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. వారిని ఎవరు కిడ్నాప్‌ చేశారన్న దానిపై యువకులు స్పష్టత ఇవ్వలేదు.
    

Advertisement
Advertisement