3 నెలలుగా బాలికపై యజమాని అఘాయిత్యం

Owner Molested 14 Years Girl Since 3 Months In Shamshabad - Sakshi

పట్టణంలోని సతీష్‌(40) పూల దుకాణంలో కొంతకాలంగా పనిచేస్తోన్న బాలిక(14)

సాక్షి, శంషాబాద్‌: పూల దుకాణం యజమాని ఓ బాలికపై మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలిలాన్నాయి. స్థానిక హుడా కాలనీలో నివసించే బాలిక(14) పట్టణంలోని సతీష్‌(40) పూల దుకాణంలో కొంతకాలంగా పనిచేస్తోంది. బాలికను బైక్‌పై ఇంటి వద్ద వదిలేసే క్రమంలో మూడు నెలలుగా బాలికపై లైంగిక దాడి చేస్తున్నాడు. ఇటీవల అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా దారుణానికి ఒడిగట్టేందుకు యత్నించడంతో బాలిక అఘాయిత్యాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబసభ్యులు మంగళవారం ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపారు. సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలకార్మికురాలిని పనిలో పెట్టుకోవడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టిన అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top