కార్వీ ఎండీ కేసు: మరో ఇద్దరు నిందితుల అరెస్టు

CCS Police Arrested 2 Accused In Corvey Partha Sarathi Case In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: కార్వీఎండీ పార్థసారథి రుణాల ఎగవేత కేసులో మరో ఇద్దరు నిందితులను గురువారం సెంట్రల్‌ సైబర్‌ స్టేషన్‌(సీసీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. కాగా, నిందితులిద్దరిని రాజీవ్‌, హరికృష్ణలుగా గుర్తించారు. వీరిద్దరు కూడా నకిలీ షెల్‌ కంపెనీలతో మోసాలకు పాల్పడ్డారని సీసీఎస్‌ పోలీసులు నిర్ధారించారు.

ఎండీ పార్థసారథి సూచన మేరకే నిందితులు నకిలీ షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేశారు. కాగా, నిందితులిద్దరు 2014 నుంచి షెల్‌ కంపెనీలను నడుపుతున్నట్లు సీసీఎస్‌ పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్‌ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేసిన  విషయం తెలిసిందే. 

చదవండి: Tollywood Drugs Case: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఈడీ నోటీసులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top