ఆటో డ్రైవర్‌ అకృత్యం.. బస్టాప్‌లో దింపుతానని చెప్పి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి

Auto Rickshaw Driver Molested Female Passenger In Chandigarh - Sakshi

చండీగఢ్‌: మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆడవారికి ఆడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. అండగా నిలవాల్సిన వారే బాధ్యత మరిచి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా బస్టాప్‌లో దించుతానని చెప్పి నమ్మించి యువతిపై ఆటో డ్రైవర్‌ తన ఆటోలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన యువతి ఒకరిని కలిసిందేకు చండీగఢ్‌కు వచ్చింది. అయితే వారు సమాయానికి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాలనుకుంది. వెంటనే చండీగఢ్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ ట్రైన్‌ అందుబాటులో లేకపోవడంతో బస్‌ ద్వారా ఢిల్లీకి చేరుకోవాలనుకుంది. దీంతో రైల్వే స్టేషన్‌ నుంచి బస్టాండ్‌వరకు ఆటోను అద్దెకు తీసుకుంది. 
చదవండి: వివాహేతర సంబంధం: ఫోన్‌కాల్‌ ద్వారా పరిచయం.. అర్థరాత్రి సమయంలో

అయితే యువతిపై కన్నేసిన ఆటో డ్రైవర్‌ ఆమెను బస్టాండ్‌కు తీసుకెళ్లకుండా ఛండీగఢ్‌ సివిల్‌ సెక్రటేరియట్‌ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై ఆటోలో అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేగాక ఆమెపై దాడి చేసి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం బాధితురాలి అరుపులు విన్న సివిల్‌ సెక్రటేరియట్‌ నైట్‌ గార్డ్‌ 112 హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు కాల్‌ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జైదేవ్‌ అలియాస్‌ ఉపేందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చండీగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలోని దర్వా ప్రాంతంలో నివసిస్తున్న నిందితుడికి ఇటీవలే వివాహం అయినట్లు పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top