వివాహేతర సంబంధం: ఫోన్‌కాల్‌ ద్వారా పరిచయం.. అర్థరాత్రి సమయంలో

Extra Marital Affair: Vijayawada Man Attempted To Kill His Lover - Sakshi

సాక్షి, జగ్గయ్యపేట/వరంగల్‌: ప్రేయసి గొంతు కోసి, ప్రియుడు కూడా ఆత్మ హయత్యా యత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలంలోని సుబ్బాయిగూడెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఎన్‌.ఏసురాజుకు కొంత కాలంనుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఫోన్‌కాల్‌ ద్వారా వరంగల్‌కు చెందిన కృష్ణవేణితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ తరుచూ కలిస్తుండేవారు. ఈ క్రమంలో ఏసురాజు కృష్ణవేణికి ఫోన్‌ చేసి ఆదివారం సుబ్బాయి గూడెం రప్పించాడు.
చదవండి: ప్రేయసి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని.. ఎంత పనిచేశావ్‌ తరుణ్‌..

అర్ధరాత్రి సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తటంతో ఏసురాజు బ్లేడ్‌తో కృష్ణవేణి గొంతుపై గాయం చేసి, తాను చేతిపై కోసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్‌ఐ హరిప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 వాహనంలో వారిద్దరినీ పెనుంచిప్రోలులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలు స్వల్పంగా కావటంతో ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని ఎస్‌ఐ తెలిపారు.అయితే ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకు ప్రియురాలు ముందుకురాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.
చదవండి: విషాదం: సుగుణ తలుపులు తీయ్‌.. కిటికీలో నుంచి చూడగా..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top