శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు

Aug 2 2025 6:32 AM | Updated on Aug 2 2025 6:32 AM

శాస్త

శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు

చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసపు రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, రంగురంగు పూలతో ముస్తాబుచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు అందజేశారు.

శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు 1
1/1

శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement