
కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.81 కోట్లు
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని సోమవారం ఆలయ అధికారులు లెక్కించారు. ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1.81,84,138కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.21,032, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.53,031లు వచ్చింది. యూఎస్ఏవి 2488 డాలర్లు, ఇంగ్లండ్వి 5 పౌండ్స్, యూఏఈ 230 దిర్హామ్స్, యూరోవి 20 యూరోలు, కెనడావి 55 డాలర్స్ వచ్చాయి. బంగారం 40 గ్రాములు, వెండి 790 గ్రాములు భక్తులు కానుక రూపంలో సమర్పించుకున్నారు. ఏఈవోలు రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్, నాగేశ్వరరావు, కోదండపాణి, శ్రీధర్బాబు పాల్గొన్నారు.